Kandukur Stampede: ఒక్కో కుటుంబానికి రూ.24లక్షలు ఆర్థికసాయం: TDP

by Nagaya |   ( Updated:2022-12-29 07:30:13.0  )
Kandukur Stampede: ఒక్కో కుటుంబానికి రూ.24లక్షలు ఆర్థికసాయం: TDP
X

దిశ, డైనమిక్ బ్యూరో : కందుకూరు ఘటనలో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి టీడీపీ రూ.24లక్షలు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. ఈ ప్రమాదంపై పార్టీ సీనియర్ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు రూ.24 లక్షలు సాయం చేయాలని నిర్ణయించారు. పార్టీపరంగా ఒక్కో కుటుంబానికి రూ. 15 లక్షలు చొప్పున సాయం చేయాలని నిర్ణయించారు. అయితే తమవంతుగా మరో రూ. 9 లక్షలు ఇస్తామని టీడీపీ నేతలు ప్రకటించారు. మొత్తంగా రూ.24లక్షలు సాయం చేయాలని టీడీపీ నిర్ణయించింది. టీడీపీకి చెందిన కంచర్ల సుధాకర్ రూ.2 లక్షలు, కంచర్ల శ్రీకాంత్ రూ. 1 లక్ష, ఇంటూరి నాగేశ్వరరావు రూ. 1 లక్ష, ఇంటూరి రాజేశ్‌ రూ.1 లక్ష, శిష్ట్లాలోహిత్ రూ. 1 లక్ష వంతున తమ ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే బొబ్బిలి టీడీపీ కీలక నేత బేబీ నాయన రూ.50,000, కేశినేని ఫౌండేషన్ తరపున కేశినేని చిన్ని రూ.50,000 మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ రూ.50,000, పోతుల రామారావు రూ.50,000, పొడపాటి సుధాకర్ రూ.50,000, వెనిగండ్ల రాము రూ. 50,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. దీంతో బాధిత మృతుల ఒక్కో కుటుంబానికి రూ.24లక్షలు చొప్పున టీడీపీ ఆర్థిక సాయం ప్రకటించింది.

Also Read...

పార్టీ జెండా మోసే కార్యకర్తల పాడె మోయాల్సి రావడం బాధాకరం : NBK

Advertisement

Next Story

Most Viewed