ఫ్యాన్‌ని రోడ్డుపై ఈడ్చుకెళ్లిన టీడీపీ అభిమానులు

by Ramesh N |   ( Updated:2024-06-04 11:59:10.0  )
ఫ్యాన్‌ని రోడ్డుపై ఈడ్చుకెళ్లిన టీడీపీ అభిమానులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ హవా కొనసాగిస్తోంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఈ క్రమంలోనే కూటమి మ్యాజిక్ ఫిగర్ 88 దాటేసి ఘటన విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే పార్టీ శ్రేణులు, అభిమానులు తమ తమ ప్రాంతాల్లోని పార్టీ ఆఫీస్‌ల వద్దకి భారీగా చేరుకుంటున్నారు. గెలుస్తున్నామనే ధీమాతో రోడ్లపైకి వచ్చి సంబరపడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో వైసీపీ సింబల్ అయిన ఫ్యాన్‌ని బైక్‌కు కట్టి రోడ్డుపై టీడీపీ అభిమానులు ఈడ్చుకెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed