టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు అస్వస్థత

by Gantepaka Srikanth |
టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు అస్వస్థత
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఫీవర్‌తో పల్లా శ్రీనివాస్ ఆస్పత్రిలో చేరారు. గతకొన్ని రోజులుగా శ్రీనివాస్ వరద బాధిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. సహాయక చర్యల్లో పాల్గొనడంతో పాటు బాధితులను పరామర్శించి భరోసా నింపారు. కాగా, గత జూన్ 28వ తేదీన పల్లా శ్రీనివాసరావును టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై పల్లా శ్రీనివాసరావు రాష్ట్రంలోనే అత్యధికంగా 95,235ఓట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed