ఎమ్మెల్సీగా ధృవీకరణ పత్రం అందుకున్న మురళి

by Javid Pasha |
ఎమ్మెల్సీగా ధృవీకరణ పత్రం అందుకున్న మురళి
X

దిశ, గూడూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా సోమవారం మేరుగ మురళిధర్‌ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. అధికారికంగా నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ రొనంకి కూర్మనాథ్ మురళికి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఇకపై ఎమ్మెల్సీగా మేరిగా మురళీధర్ సేవలు అందించనున్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వాకాటి నారాయణ రెడ్డి కొనసాగుతున్నారు. మే నెల 1వ తేదీ ఆయన పదవీ కాలం పూర్తి కానుంది.

Next Story

Most Viewed