కొందరు ఖాకీలు పోలీసు వ్యవస్థకే మచ్చ తెస్తున్నారు: నారా లోకేశ్

by Seetharam |
కొందరు ఖాకీలు పోలీసు వ్యవస్థకే మచ్చ తెస్తున్నారు: నారా లోకేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలోని కొందరు పోలీసుల అధికారుల తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల తొత్తులుగా మారిన కొందరు ఖాకీలు పోలీసు వ్యవస్థకే మచ్చ తెస్తున్నారని ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ మీడియాతో మాట్లాడారు. మంత్రాలయం నియోజకవర్గం కోసిగి ఐటీడీపీ అధ్యక్షుడు షేక్.హుస్సేన్ బాషాపై ఎస్ఐ విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. టీడీపీ అంటే అంత ఇష్టమా అని ఎస్ఐ సతీష్ కుమార్ దుర్భాషలాడటం, స్టేషన్‌కి పిలిచి కొట్టడం అత్యంత దారుణం అని అన్నారు. అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్న హుస్సేన్ బాషాను రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని అబద్ధం చెప్పి పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి కొట్టారని ఆరోపించారు. టీడీపీ నాయకుడు హుస్సేన్ బాషాకు ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని నారా లోకేశ్ భరోసా ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed