వైఎస్ జగన్‌పై మరోసారి రెచ్చిపోయిన షర్మిల.. వారితో కలిసి ప్లాన్ చేశారని సంచలన కామెంట్స్!

by Jakkula Mamatha |   ( Updated:2024-09-03 15:23:39.0  )
వైఎస్ జగన్‌పై మరోసారి రెచ్చిపోయిన షర్మిల.. వారితో కలిసి ప్లాన్ చేశారని సంచలన కామెంట్స్!
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీ రాజకీయాల్లో బాలీవుడ్ నటి జెత్వానీ కేసు ప్రకంపనలు రేపుతోంది. ఈ క్రమంలో తాజాగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జెత్వానీ కట్టడి చేయడానికి మాజీ సీఎం జగన్, పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ కలిసి ప్లాన్ చేశారని వైఎస్ షర్మిల ఆరోపించారు. యాక్టింగ్ ఫీల్డ్‌లోకి వచ్చి ఎదగాలనుకున్న జెత్వానీని మానసికంగా వేధించారని చెప్పారు. కేసు పెట్టాలనుకున్న ఆమెను నిర్బంధించి వేధించారని షర్మిల పేర్కొన్నారు. ఉన్నత కుటుంబానికి చెందిన జెత్వానీని ఇక్కడికి తీసుకొచ్చి అరెస్టు చేశారని ఫైరయ్యారు. ఈక్రమంలో మాజీ సీఎం జగన్ పై ప్రశ్నల వర్షం కురిపించింది.

వైఎస్ జగన్‌కు తెలియకుండానే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వ్యవహరిస్తారా? అని షర్మిల ప్రశ్నించారు. ఇద్దరు కుమార్తెలు ఉన్న జగన్ బాలీవుడ్ నటికి జరుగుతున్న అన్యాయంపై ఎందుకు ఆలోచించలేదు? అని ప్రశ్నించారు. సజ్జన్ జిందాల్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని జగన్ గొప్పగా చెప్పుకున్నారని గుర్తు చేశారు. జిందాల్‌కు కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జగన్ ఎందుకు కట్టబెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి జెత్వానీకి అండగా ఉండి, ఆమె కోసం పోరాడేందుకు తాను సిద్ధమని వైఎస్ షర్మిల వ్యాఖ్యనించారు.

Advertisement

Next Story

Most Viewed