Vijayawada Floods:వరదలపై మరోసారి స్పందించిన టీడీపీ సీనియర్ నేత..!

by Jakkula Mamatha |
Vijayawada Floods:వరదలపై మరోసారి స్పందించిన టీడీపీ సీనియర్ నేత..!
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల(Heavy Rains) కారణంగా విజయవాడను(Vijayawada) వరదలు(Floods) ముంచెత్తాయి. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. భారీ వరదల(Heavy Floods) కారణంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించాయి. ఈ క్రమంలో విజయవాడ వరదలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరోసారి స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వరద బాధితులకు(Flood Victims) అండగా సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.5లక్షల విరాళం అందజేశానని గుర్తుచేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీడీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా పోరాటాలు చేసిన కార్యకర్తలు సైతం ఈ వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో టీడీపీ కోసం పని చేసిన కార్యకర్తలను ఆదుకునేందుకు తాను మళ్లీ ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఈ వరద నీరు ఇళ్లలోకి చేరడంతో వారి నివాసంలో గృహోపకరణాలు సైతం పాడైపోయాయని తెలిపారు. ఈ క్రమంలో నష్టపోయిన వారందరికీ తమ కుటుంబ సభ్యుల ద్వారా ఆయా వస్తువులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు బుద్ధా వెంకన్నా ప్రకటించారు. ప్రజెంట్ ఆయన వైరల్ ఫీవర్‌తో(Viral Fever) బాధ పడుతున్నానన్నారు. ఆ కారణంగా హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో తాను ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా పార్టీ కోసం పని చేసి వరదల్లో నష్టపోయిన వారు ఉంటే ఆ వివరాలు తన దృష్టికి తీసుకు రావాలని విజ్ఞప్తి చేశారు. వారందరికీ తన వంతుగా తప్పకుండా సహాయం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed