AP Politics:నిన్న అక్కడ..నేడు ఇక్కడ..రెండు పార్టీల్లో మారిన కండువాలు!

by Disha Web Desk 18 |
AP Politics:నిన్న అక్కడ..నేడు ఇక్కడ..రెండు పార్టీల్లో మారిన కండువాలు!
X

దిశ,శ్రీకాళహస్తి: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల్లో మార్పులు, చేర్పులు సహజం. అయితే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చోటా మోటా నాయకులు కూడా రోజుకొక పార్టీ మారుతున్నారు. రోజుకొక కండువా కప్పుకొని వాళ్లు ప్రలోభ పెట్టారు. వీళ్ళు బలవంతంగా కండువా కప్పారని కప్పి పుచ్చుకుంటున్నారు. ఏర్పేడు మండలం పల్లం పంచాయతీ సర్పంచ్ గోపాల్ యాదవ్ బుధవారం టీడీపీ ఇంచార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే గురువారం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సమక్షంలో తిరిగి వైసీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీ నాయకులు తనకు బలవంతంగా కండువా కప్పారని ఆయన చెప్పడం కొసమెరుపు. అదేవిధంగా ముదిరాజ్ సంఘం నాయకుడు పూల ఆనంద్ వారం రోజుల క్రితం బియ్యపు మధుసూదన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు.

అయితే బుధవారం రాత్రి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వైసీపీ నాయకులు తనను ప్రలోభ పెట్టారని ఆ పార్టీలో చేరలేదని పూల ఆనంద్ ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే ఎస్సీ వి నాయుడు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఆయన ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. పూల ఆనంద్ కూడా టీడీపీలోనే కొనసాగారు. అయితే వైసీపీలో చేరడం వారం రోజుల్లో మళ్లీ టీడీపీలోకి రావడం జరిగిపోయింది. శ్రీకాళహస్తి మండలం గంగలపూడి, తొట్టంబేడు మండలం చేమూరు, మామిడి గుంట, ఏర్పేడు మండలం ఆమందూరు గ్రామానికి చెందిన కొందరు గురువారం వైసీపీలోకి చేరారని ఎమ్మెల్యే ప్రకటించారు.



Next Story

Most Viewed