అకీరాతో ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడారో చెప్పిన రేణు దేశాయ్..

by sudharani |
అకీరాతో ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడారో చెప్పిన రేణు దేశాయ్..
X

దిశ, సినిమా: జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్.. NDA భాగస్వామ్య పక్షాల భేటీ సందర్భంగా తాజాగా చంద్రబాబుతో కలిసి ఢిల్లీ వెళ్లారు. పవన్ కల్యాణ్ తనతో పాటు.. తన సతీమణి అన్నా లెజ్నెవాతో పాటు కొడుకు అకీరా నందన్‌ను కూడా తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి అకీరా పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. ప్రధాన మోడీతో కలిసి పవన్ కల్యాణ్, అకీరా దిగిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

అంతే కాకుండా దీనిపై రేణు దేశాయ్ కూడా ఓ పోస్ట్ పెట్టింది. తనకు ఎంతో ఇష్టమైన నాయుకుడు మోడీతో అకీరా ఫొటో దిగడం చాలా సంతోషంగా ఉందంటూ ఇన్‌స్టా వేదికగా ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా నెటిజన్లు.. మోడీ అకీరాతో ఏం మాట్లాడారో కూడా ఓ వీడియో చేసి పెట్టండి మేడం అంటూ రిక్వెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన రేణు దేశాయ్.. ‘ఇంత హైట్ ఉన్నావు కదా.. బాస్కెట్ బాల్ ఆడడం లేదు ఎందుకు అని అడిగితే అకీరా సిగ్గు పడ్డాడు’ అంటూ రిప్లై ఇచ్చింది రేణు.



Next Story