‘సమాజ రక్షణలో మేముంటాం’.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్!

by Jakkula Mamatha |   ( Updated:2024-10-04 10:11:13.0  )
‘సమాజ రక్షణలో మేముంటాం’.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న తిరుపతిలో నిర్వహించిన వారాహి సభలో ‘సనాతన ధర్మం’ గురించి వ్యాఖ్యానించారు. అయితే తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్, డిప్యూటీ సీఎం పవన్ మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతూనే ఉంది. అయితే బుధవారం జరిగిన వారాహి సభలో పవన్ ప్రసంగిస్తూ.. ఇతర మతాల గురించి ఎవరైనా మాట్లాడితే నటులు, చిత్ర పరిశ్రమ, వ్యాపారస్తులు అందరూ మాట్లాడుతారని, సనాతన ధర్మం పై దాడులు జరిగితే ఒక్కరూ స్పందించరని పవన్ ఆరోపించారు. నేను సనాతన ధర్మాన్ని పాటిస్తే అవహేళన చేసి మాట్లాడుతున్నారు. నా ప్రాయశ్చిత్త దీక్షను కూడా అవహేళన చేశారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. సనాతన ధర్మం ఎప్పుడూ మనుషులు ఒక్కరే సుఖంగా ఉండాలని కోరుకోదని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ప‌వ‌న్ కళ్యాణ్ వ్యాఖ్య‌ల‌పై తాజాగా మ‌రోసారి ట్విట్టర్ వేదికగా ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ కౌంట‌ర్ ఇచ్చాడు. ‘‘స‌నాత‌న ధ‌ర్మ ర‌క్ష‌ణ‌లో మీరుండండి. స‌మాజ ర‌క్ష‌ణ‌లో మేముంటాం’’ అంటూ ప‌వ‌న్‌కు ప‌రోక్షంగా కౌంట‌ర్ ఇచ్చాడు. ప్ర‌జెంట్ ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Next Story