వందే భారత్ ఎక్స్‌ప్రెస్ దేశానికి గర్వ కారణం: ఎమ్మెల్యే కరణం బలరాం

by srinivas |
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ దేశానికి గర్వ కారణం: ఎమ్మెల్యే కరణం బలరాం
X

దిశ, చీరాల: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారత దేశానికి గర్వ కారణమని చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి అన్నారు. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ చీరాల రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో ఆయన స్వాగతించారు. తోటి ప్రయాణికులతో కలిసి ఒంగోలు వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

కాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 8 గంటల 30 నిమిషాల్లో చేరుకోవడం విశేషం. ఈ రోజు మాత్రమే చీరాల రైల్వే స్టేషన్‌లో స్టాపింగ్ ఉంది. ఆదివారం నుంచి ఒంగోలులో మాత్రమే స్టాపింగ్ ఉంటుంది. ప్రయాణికులు గమనించగలరని చీరాల రైల్వే అధికారులు తెలిపారు.

Advertisement

Next Story