జగన్‌ను వరంగల్‌లో రాళ్లతో తరిమికొట్టడానికి కారణం అదే: పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |
జగన్‌ను వరంగల్‌లో రాళ్లతో తరిమికొట్టడానికి కారణం అదే: పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఏర్పాటు కోసం మలిదశ ఉద్యమం విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్‌ను మరోసారి టార్గెట్ చేశారు. జగన్ చేసిన పనుల వల్లే ఆంధ్రా నాయకులను హైదరాబాద్ నుండి తరిమేశారని ఇది వరకు ఆరోపించిన పవన్ కళ్యాణ్.. ఈ విషయంలో వెనక్కితగ్గడం లేదు. ఈ సారి విమర్శల్లో మరింత డోస్ పెంచాడు. తాజాగా మాట్లాడిన పవన్ కళ్యాణ్.. తెలంగాణ సహజ వనరులను, భూములను వైఎస్సార్ ఫ్యామిలీ అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపించారు.

వైఎస్సార్ సీఎం అయ్యాక పర్యావరణానికి సంబంధించి, సహజ వనరుల దోపిడి, ప్రభుత్వ ఆస్తుల దోపిడీ విపరీతంగా పెరిగిందన్నారు. అంతకు ముందు పర్యావరణ విధ్వంసానికి కిటికీ అంతా ప్రవేశం ఉంటే వైఎస్సార్ వచ్చాక ద్వారబంధాలు లేకుండా దోచుకున్నారని.. అందువల్లే తెలంగాణ ప్రజల్లో ఆంధ్ర వారి పట్ల కోపం పెరిగిందన్నారు. ఈ కోపానికి కారణాల్లో వైఎస్ జగన్ కూడా ఒకరని.. అందుకే వరంగల్ మానుకోటలో జగన్ దిగుతుంటే స్టేషన్లోనే తెలంగాణ విద్యార్థులంతా రాళ్లతో తరిమి కొట్టారని ఆరోపించారు. 2004లో వైఎస్సార్ హయాంలో ఏ దోపిడి జరిగిందో అదే దోపిడి ఇప్పుడు జగన్ కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు.

Advertisement

Next Story

Most Viewed