‘ప్లీజ్.. ఆ పని చేయకండి ’.. అభిమానులకు, కార్యకర్తలకు పవన్ కల్యాణ్ కీలక రిక్వెస్ట్

by Satheesh |
‘ప్లీజ్.. ఆ పని చేయకండి ’.. అభిమానులకు, కార్యకర్తలకు పవన్ కల్యాణ్ కీలక రిక్వెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిన పవన్.. ఈ సారి పిఠాపురం నుండి భారీ మెజార్టీతో గెలిసి ఏకంగా చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్నారు. పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన పార్టీ అభ్యర్థులు కూడా ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని చోట్ల విజయం సాధించి 100 పర్సంట్ విన్నింగ్ స్ట్రైక్ రేట్ నమోదు చేశారు. ఈ క్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తనను కలవడానికి వచ్చే అభిమానులు, కార్యకర్తలకు కీలక విజ్ఞప్తి చేశారు. తనను కలిసి అభినందనలు తెలపడానికి వచ్చే వారు దయచేసి బొకేలు, శాలువాలు తేవొద్దని కోరారు. ఆ డబ్బులను ఏదైనా మంచి కార్యక్రమం కోసం ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు. ఇక, ఎన్నికల్లో తమకు ఘన విజయం అందించిన ఏపీ ప్రజలకు పవన్ కల్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. త్వరలో జిల్లాల వారీగా అందరినీ కలుస్తానని చెప్పారు. ఈ నెల 20 తర్వాత తన సొంతనియోజకవర్గమైన పిఠాపురంలో పర్యటిస్తానని.. తర్వాత దశలవారీగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తానని పేర్కొన్నారు.

Read More : పవన్ కళ్యాణ్ గెలుపు వెనుక మరో కీలక వ్యక్తి!.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed