మరోసారి తన నెల జీతాన్ని విరాళంగా ప్రకటించిన మంత్రి

by Mahesh |
మరోసారి తన నెల జీతాన్ని విరాళంగా ప్రకటించిన మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన మండపల్లి రాంప్రసాద్ రెడ్డికి.. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ పదవి దక్కింది. అనంతరం మంత్రిగా తనకు వచ్చిన మొదటి జీతాన్ని రాజధాని అమరావతి నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చిన మంత్రి మరోసారి తన జీతాన్ని విరాళంగా ప్రకటించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా.. పేద క్రీడాకారులకు సహాయార్థం తన నెల జీతాన్ని విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా మంత్రి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తూ.. ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed