నెల్లూరు, ఒంగోలు, పుట్టపర్తిలలో కొత్త ఎయిర్‌పోర్టులు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

by Y. Venkata Narasimha Reddy |
నెల్లూరు, ఒంగోలు, పుట్టపర్తిలలో కొత్త ఎయిర్‌పోర్టులు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు, ఒంగోలు, పుట్టపర్తిలలో కొత్త ఎయిర్‌పోర్టులను నిర్మిస్తామని, కొత్త ఎయిర్‌పోర్టులకు త్వరలో శంకుస్థాపన చేయబోతున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. నెల్లూరు, ఒంగోలు, పుట్టపర్తిలలో కొత్త ఎయిర్‌పోర్టులు నిర్మాణం కోసం స్థలాలను పరిశీలన పురోగతిలో ఉందని, భూసేకరణ పూర్తికాగానే కొత్త ఎయిర్‌పోర్టులకు శంకుస్థాపన చేస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏడు విమానాశ్రయాలకు తోడు మరో ఏడు ఎయిర్‌పోర్టులు నిర్మించాలని అనుకుంటున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, పుట్టపర్తి సహా ఏడుచోట్ల విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. భూసేకరణ పూర్తయిన చోట ముందుగా ఎయిర్‌పోర్టులకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు.

గతంలో దేశవ్యాప్తంగా 74 విమానాశ్రయాలు ఉండేవన్న రామ్మోహన్ నాయుడు.. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ సంఖ్య 157కు చేరిందన్నారు. తిరుపతి నుంచి దేశ రాజధాని ఢిల్లీకి నేరుగా విమాన సర్వీసు లేకపోవటంతో గతంలో ఈ ప్రాంతవాసులు ఇబ్బందులు పడేవారని..అందుకే తిరుపతి – ఢిల్లీ మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి విమానాశ్రయం నుంచి కనెక్టివిటీ పెంచుతామని హామీ ఇచ్చారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టులను మరింత అభివృద్ధి చేసేందుకు, మరిన్ని సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తిరుపతి, ముంబై, కోయంబత్తూరు, కలకత్తా నుంచి తిరుపతికి డైరెక్ట్ విమాన సర్వీసులు కావాలని డిమాండ్ పెరుగుతుందని, ఈ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed