కరెంట్ షాక్ తో అసిస్టెంట్ లైన్మెన్ నరేష్ మృతి...

by Kalyani |   ( Updated:2024-10-06 11:14:31.0  )
కరెంట్ షాక్ తో అసిస్టెంట్ లైన్మెన్ నరేష్ మృతి...
X

దిశ, మానకొండూరు : కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం కెల్లెడ్ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మానకొండూరు మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ అసిస్టెంట్ లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్న జోగి నరేష్ (34)అనే అసిస్టెంట్ లైన్మెన్ ఆదివారం విద్యుత్ స్తంభం పై నుండి షార్ట్ సర్క్యూట్తో కింద పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మృతుని స్వగ్రామం సిరిసిల్ల జిల్లా చిర్లవంఛ గ్రామం కాగా అసిస్టెంట్ లైన్ మెన్ గా సుమారు నాలుగు సంవత్సరాలుగా మండలంలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. విధినిర్వహణలో భాగంగా భార్య ఇద్దరు పిల్లలతో కలిసి మానకొండూర్ మండలం కొండపల్కల గ్రామంలోని ఓ ఇంట్లో కిరాయికి నివాసం ఉంటూ విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చెంజర్ల ఏఈ ని ఫోన్లో వివరణ అడగగా అసిస్టెంట్ లైన్ మెన్ షార్ట్ సర్క్యూట్ వల్లనే చనిపోయారని నిర్దారణ అయినట్టు చెంజర్ల ఏ ఈ తెలిపారు.


Advertisement

Next Story