Breaking: శంఖారావం సభలో నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు

by Indraja |   ( Updated:2024-02-12 07:51:19.0  )
Breaking: శంఖారావం సభలో నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ డైనమిక్ బ్యూరో: ఈ రోజు శ్రీకాకుళం జిల్లా లోని నరసన్నపేటలో ఈ రోజు శంఖారావం భహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక జగన్ పని అయిపోయిందని తెలిపారు. ఆ మాట తాను చెప్తుంది కాదని.. వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు 25 ఎంపీలను గెలిపిస్తే ఢిల్లీ మెడ వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి అన్నారని తెలిపారు.

ఇక ప్రజలు 31 మంది ఎంపీలను ఇస్తే.. ఆ ఎంపీలను కేసుల మాఫీ కోసం కేంద్రానికి తాకట్టు పెట్టిన వ్యక్తి జగన్ అని ఆరోపించారు. దీనితో ఎంపీలకు కూడా జగన్మోహన్ రెడ్డిపై నమ్మకాన్ని కోల్పోయారని.. అందుకే ఇటీవల ఢిల్లీ వెళ్లిన జగన్మోహన్ రెడ్డి వెంట 31 మంది ఎంపీల్లో కేవలం 6 మంది ఉన్నారు అని ఎద్దేవ చేశారు. అలానే ఎన్నికల ముందు వైసీపీని గెలిపిస్తే అధికారం లోకి వచ్చిన వారంలో సీపీఎస్ ని రద్దు చేస్తాను అని చెప్పిన జగన్ 4 ఏళ్ళ 10 నెలలు గడిచిన సీపీఎస్ ని రద్దు చెయ్యలేదు కానీ ఉద్యోగస్తులను మాయం చేసే జీపీఎస్ ని తీసుకొచ్చారు అని ఎద్దేవ చేసారు.

ఇక జగన్ ప్రపంచంలో ఎక్కడ లేని పథకం తీసుకొచ్చారని.. ఆ పథకం పేరు ఎమ్మెల్యేల బదిలీ అని పేర్కొన్నారు. ఇక ఒక ఇంట్లో చెత్త పక్కింటి ముందు వేస్తె బంగారం అవుతున్నదా అని ప్రశ్నించారు.

Advertisement

Next Story