కీలకం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాదెండ్ల తిష్ట

by Seetharam |
కీలకం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాదెండ్ల తిష్ట
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటిస్తున్నారు. రెండు రోజులపర్యటనలో భాగంగా రావులపాలెం చేరుకున్న నాదెండ్ల మనోహర్‌కు కోనసీమ ముఖద్వారం వద్ద పార్టీ నాయకులు,కార్యకర్తలు, వీర మహిళలు ఘన స్వాగతం పలికారు. నాదెండ్ల మనోహర్‌కి స్వాగతం పలికిన వారిలో పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ, కొత్తపేట ఇన్‌చార్జి బండారు శ్రీనివాస్, మండపేట ఇన్‌చార్జి వేగుళ్ళ లీలాకృష్ణ, పి.గన్నవరం నియోజకవర్గం జనసేన నేత, యూఏఈ జనసేన కన్వీనర్ పెనుమాల జాన్ బాబులు ఉన్నారు. ఇకపోతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కొత్తపేట, మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాలలో పర్యటించనున్నారు. ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలను పరామర్శించి రూ. 5 లక్షల బీమా చెక్కులు అందచేస్తున్నారు. అలాగే జనసేనలోకి చేరికల కార్యక్రమానికి నాదెండ్ల మనోహర్ ముఖ్యఅతిధిగా హాజరుకానున్నారు. ఇకపోతే ఈనెల 19న కాకినాడ ముత్తా క్లబ్‌లో పార్టీ ముఖ్యనాయకులు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో నాదెండ్ల మనోహర్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అనంతరం కాకినాడ నగర క్రియాశీలక జనసేన సభ్యులతో సమావేశం కానున్నారు.

Advertisement

Next Story

Most Viewed