పుంగనూరులో వింత రాజకీయాలు.. మళ్లీ వైసీపీలో చేరిన మున్సిపల్ చైర్మన్

by Mahesh |   ( Updated:2024-09-03 15:26:59.0  )
పుంగనూరులో వింత రాజకీయాలు.. మళ్లీ వైసీపీలో చేరిన మున్సిపల్ చైర్మన్
X

దిశ, వెబ్ డెస్క్: ఓ వైపు భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చి ప్రజలు అల్లాడిపోతుంటే.. పుంగనూరులో మాత్రం వింత రాజకీయాలు నడుస్తున్నాయి. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ పుంగనూరు రాజకీయాలు వైసీపీ, డీటీపీ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగుతుంది. ఈ క్రమంలోనే రెండు నెలల కిందట వైసీపీని వీడి టీడీపీలో చేరిన మున్సిపల్ చైర్మన్ అలీమ్ బాషా, ఇతర కౌన్సిలర్లు.. తిరిగి ఈ రోజు మళ్లీ వైసీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అలీ మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు బెదిరింపులకు భయపడి అప్పడు ఆ పార్టీలో చేరామని.. ఇన్ని రోజులు ఆ పార్టీలో ఉంటే నరకంలో ఉన్నట్లు అనిపించిందని అన్నారు. అలాగే ఇకపై తన ఊపిరి ఉన్నంత వరకు పెద్దిరెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తామని మీడియాతో చెప్పుకొచ్చారు. తాజా పరిస్థితులతో పుంగనూరులో రాజకీయ వేడి నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed