AP Politics:ఢిల్లీలో జగన్ ధర్నాపై మంత్రి హాట్ కామెంట్స్..!

by Jakkula Mamatha |
AP Politics:ఢిల్లీలో జగన్ ధర్నాపై మంత్రి హాట్ కామెంట్స్..!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నిధుల కొరత గురించి సమీక్ష నిర్వహించి, కేంద్రం సహాయం కావాలని ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందనీ విమర్శించారు. నేడు(సోమవారం) మంత్రి సత్యకుమార్ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఢిల్లీలో నిర్వహించబోతున్న ధర్నా పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..కేంద్ర సహాకారంతో రాష్ట్రానికి ఎక్కువ నిధులు సాధిద్దామని బీజేపీ నేత, మంత్రి సత్య కుమార్ అన్నారు. అసెంబ్లీ కమిటీ హల్‌లో కూటమి నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీకి అన్ని విధాలా సహకారానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. నిధుల కొరతను అధిగమించేందుకు కలిసికట్టుగా కృషి చేద్దాం అన్నారు. వైఎస్ జగన్ ఇదే ధోరణి కొనసాగిస్తే భంగపాటు తప్పదు అని చెప్పారు. ఢిల్లీలో జగన్ ఎన్ని విన్యాసాలు చేసినా పట్టించుకునే వారు లేరు అని అన్నారు.



Next Story