ఆ దారుణం తలుచుకుంటే మాటలు రావట్లేదు.. కోల్‌కతా ఘటనపై మంత్రి లోకేష్ ఎమోషనల్

by Gantepaka Srikanth |
ఆ దారుణం తలుచుకుంటే మాటలు రావట్లేదు.. కోల్‌కతా ఘటనపై మంత్రి లోకేష్ ఎమోషనల్
X

దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతాలో వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటనను ఏపీ మంత్రి నారా లోకేష్ ఖండించారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా పోస్టు పెట్టారు. ఈ దారుణం తలుచుకుంటే మాటలు రావడం లేదని ఎమోషనల్ అయ్యారు. బాధితురాలికి, ఆమె కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరారు. ఆ న్యాయం వేగంగా, నిర్ణయాత్మకంగా, ఆదర్శప్రాయంగా ఉండేలా చూడాలని రిక్వెస్ట్ చేశారు. భారత మహిళల భద్రత, గౌరవాన్ని కాపాడేందుకు ఐక్యంగా ఉందాం. ఇది అందరి పోరాటం అని సోషల్ మీడియా వేదికగా లోకేష్ పిలుపునిచ్చారు. కాగా, కోల్‌కత్తాలో వైద్యురాలిపై అమానుషంగా సామూహిక అత్యాచారం చేసి పాశవికంగా హత్యచేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా అందరూ స్పందిస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.

Next Story