Nara Lokesh:సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్

by Jakkula Mamatha |   ( Updated:2024-09-26 08:34:37.0  )
Nara Lokesh:సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ఈరోజు(గురువారం) ఉదయం 6 గంటలకు సింహాచలం(Simhachalam) వరాహ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆలయం ప్రధాన అర్చకులు, అధికారులు మంత్రి లోకేష్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి కప్పస్తంభం ఆలింగం స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఈ క్రమంలో వేద పండితులు నారా లోకేష్‌కు ఆశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదం అందజేశారు. కాగా విశాఖ ఎంపీ భరత్, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు లోకేష్‌తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం 9 గంటల నుంచి పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలను మంత్రి లోకేష్ కలిసినట్లు సమాచారం.

Advertisement

Next Story