విశాఖలో పర్యటిస్తున్న మంత్రి లోకేష్.. ఐటీ పాలసీపై కీలక ప్రకటన

by Jakkula Mamatha |
విశాఖలో పర్యటిస్తున్న మంత్రి లోకేష్.. ఐటీ పాలసీపై కీలక ప్రకటన
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖపట్నం నగరాన్ని భారతదేశంలో 5వ అతిపెద్ద ఆర్థిక నగరంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ ప్రణాళికలను రూపొందించామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. విశాఖలో బుధవారం సీఐఐ నిర్వహించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్మిట్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "విశాఖపట్నం అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా, భోగాపురం విమానాశ్రయం, ఐటీ, ఫార్మా హబ్ అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం ద్వారా నగరాన్ని గ్లోబల్ కేంద్రంగా తీర్చిదిద్దాలి" అని అన్నారు.

"మేము ముఖ్యంగా డిస్ట్రిక్ట్‌ల అభివృద్ధిపై దృష్టి పెట్టాము. అనంతపురం వంటి నగరాలను మొబిలిటీ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నాం. కర్నూల్‌ను పునర్నిర్మాణం చేస్తున్నాం, 72 గెగావాట్ పునరుత్పాదక శక్తిని ఏపీలో 5 సంవత్సరాల్లో రూపొందించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం" అని వ్యాఖ్యానించారు. "విశాఖపట్నంలో 12 ఫ్లైఓవర్‌లను 3 పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే లు గా మారుస్తున్నాం" అని నారా లోకేష్ గారు తెలిపారు.

ఎంపీ శ్రీభరత్ మతుకుమిల్లి మాట్లాడుతూ.. "ప్రస్తుతం విశాఖపట్నం జీడీపీ పరంగా దేశంలో 10వ స్థానంలో ఉంది. విమానాశ్రయ రవాణాలో 27వ స్థానాన్ని కలిగి ఉంది" అని తెలిపారు. జీఎంఆర్ సంస్థకు కృతజ్ఞతలు తెలుపుతూ, "విమానాశ్రయానికి సులభమైన రవాణా అవసరం ఉంది. అంతర్జాతీయ ఎయిర్ కార్గో సేవలను తిరిగి ప్రారంభించాలి" అన్నారు. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ 15 రోజుల్లో కార్గో సర్వీస్‌ను విశాఖపట్నం నుంచి ప్రారంభిస్తాం అని తెలిపారు.

పోర్ట్ లాజిస్టిక్స్ మరియు బహుళ రహదారులు నిర్మాణం పై ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. "విశాఖపట్నం అభివృద్ధిలో సక్రమమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని మేము కట్టుబడి ఉన్నాం" అని ఆయన స్పష్టం చేశారు. విశాఖపట్నం యొక్క అభివృద్ధి ప్రణాళికలు, మౌలిక సదుపాయాలు, మరియు ఆర్థిక ప్రగతి ప్రతిష్ఠను పెంచే అంశాలపై కేంద్రీకృతమైన దృష్టితో, విశాఖపట్నం భారతదేశంలో ప్రధాన ఆర్థిక కేంద్రంగా అవతరించడానికి సిద్ధంగా ఉంది అని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, సీఐఐ ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed