మద్యానికి బానిసై ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య..

by Sumithra |
మద్యానికి బానిసై ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య..
X

దిశ, నిజాంసాగర్ : మద్యానికి బాని సై క్షణికావేశంలో వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజాంసాగర్ మండలంలోని ఆరేడు గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. నిజాంసాగర్ ఎస్సై కె.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం ఆరేడు గ్రామానికి చెందిన పల్లి అశోక్ (35) అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం రాత్రి తన కుటుంబ సభ్యులు మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వడం లేదని క్షనికావేశానికి గురై తన ఇంట్లో చీరతో దూలానికి ఉరి వేసుకుని మృతి చెందినట్లు తెలిపారు.

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. మృతుడు పల్లి అశోక్ కు భార్య అనిత, ఇద్దరు పిల్లలు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య పల్లి అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కే.సుధాకర్ తెలిపారు.

Next Story