- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
కేంద్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు వర్క్ షాప్
దిశ,నల్లగొండ: కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మీడియా ప్రతినిధులకు వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ,విజయగాధలు ,సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వంటి అంశాలపై ఈనెల 26న ఒక రోజు వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ నల్గొండ జిల్లా ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి జి .కోటేశ్వరరావు తెలిపారు. 26 న ఉదయం 10:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు నల్గొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో ఈ వర్క్ షాప్ ను నిర్వహించడం జరుగుతుందని, అందువల్ల జిల్లా కేంద్రం మీడియా ప్రతినిధులతో పాటు, గ్రామీణ ప్రాంత మీడియా ప్రతినిధులు అందరూ ఈ వర్క్ షాప్ కు హాజరు కావాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అడిషనల్ ఎస్పీ.రాములు నాయక్,డీఎస్పీ.శివరాం రెడ్డి వస్తున్నట్లు తెలిపారు.