- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
సోషల్ మీడియా వేదికన రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పిచిన మంత్రి కోమటిరెడ్డి
దిశ, వెబ్డెస్క్: స్వర్గీయ నాయకులు, జనహృదయ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు డా. వై. యస్ రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోషల్ మీడియా వేదికన నివాళులు అర్పించారు. ‘‘అధికారంలో కూడా ఆత్మీయత ఉండాలని.. కార్యకర్త కష్టంలో నాయకుడు అండగా నిలవాలని.. ప్రజాసంక్షేమమే విధానంగా ప్రభుత్వ నడవాలని .. సరికొత్త పాలనను పరిచియం చేసి, అనేక ప్రజాసంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి.. చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిన జనహృదయనేత, స్వర్గీయ నాయకుడు డా. వై.యస్. రాజశేఖర్ రెడ్డికి జయంతి సందర్భంగా నా ఘననివాళి’’ అంటూ మంత్రి కోమటి రెడ్డి రాసుకొచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా మంగళగిరిలో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నాడు. రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా వెళ్లనున్నారు. ఇక వై. యస్ రాజశేఖరరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర16వ ముఖ్యమంత్రిగా.. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ప్రజలకు ఎన్నో సేవలందించారు. 1978లో మొదటిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభలో అడుగుపెట్టి.. మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నికయ్యారు. 4 సార్లు కడప లోక్సభ నియోజకవర్గం నుంచి రాజశేఖర్ రెడ్డి పార్లమెంటులో అడుగుపెట్టారు.