- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
BREAKING: ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు.. సీనియర్ ఆఫీసర్ శ్రీలక్ష్మికి షాక్..!
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన చంద్రబాబు సర్కార్ పాలనలో దూకుడు పెంచింది. ప్రభుత్వ యంత్రాంగంలో పూర్తిగా ప్రక్షాళన చేపట్టింది. ఇందులో భాగంగానే గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల పేర్ల మార్పు వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. 19 మంది ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ ప్రసాద్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
వ్యవసాయ ముఖ్య కార్యదర్శిగా రాజశేఖర్, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా శశి భూషణ్, పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాల్ కృష్ణ, జలవనరుల శాఖ స్పెషల్ సీఎస్గా సాయిప్రసాద్, పౌరసరఫరాల శాఖ కమిషనర్గా సిద్ధార్థ్ జైన్లను ప్రభుత్వం నియమించింది. సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీతో పాటు రజత్ భార్గవ్ను సాధారణ పరిపాలన శాఖ (జీడీఏ)లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.