గణేశ్ నిమజ్జనంలో అపశృతి.. ఏలేరు కాలువలో పడి వ్యక్తి మృతి

by Jakkula Mamatha |
గణేశ్ నిమజ్జనంలో అపశృతి.. ఏలేరు కాలువలో పడి వ్యక్తి మృతి
X

దిశ ప్రతినిధి,కాకినాడ: ప్రస్తుతం పలు ప్రాంతాల్లో గణపయ్య నిమజ్జనాలు ఘనంగా జరుగుతున్నాయి. కాకినాడ జిల్లాలో వినాయకుని నిమజ్జనంలో అపశృతి జరిగింది. జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గ పరిధిలోని కిర్లంపూడి మండలం పాలెం గ్రామంలో వినాయకుడి నిమజ్జనం చేస్తుండగా ఏలేరు కాలువలో పడి వీరవరం గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి మృతి చెందాడు. సంఘటనా స్థలానికి జగ్గంపేట సీఐ లక్ష్మణరావు,కిర్లంపూడి ఎస్సై సతీష్ చేరుకుని పరిశీలించారు. వినాయక నిమజ్జనం జరిగే ప్రాంతంలో అధికారులు, పంచాయతీ సిబ్బంది కనీస ఏర్పాట్లు చేయకపోవటం పై స్థానికులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed