Maadhavi Latha: ప్రకాష్ రాజ్‌కు స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిన మాధవీ లత.. వీడియో వైరల్

by Hamsa |
Maadhavi Latha: ప్రకాష్ రాజ్‌కు స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిన మాధవీ లత.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: తిరుమల తిరుపతి లడ్డూ మహా ప్రసాదం తయారిలో కల్తీ జరిగిందనే ఆరోపణలు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ సనాతన ధర్మం పాటిస్తున్నట్లు దీక్ష చేపట్టారు. ఇక అప్పటి నుంచి ప్రకాష్ రాజ్, పవన్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అయితే కోలీవుడ్ హీరో కార్తీ లడ్డూ వివాదం సెన్సిటివ్ టాపిక్ అనడంతో పవన్ ఆయనపై విరుచుకుపడ్డారు. దీంతో ఆయన క్షమాపణలు చెప్పారు. కార్తీ విషయంలో పవన్ ని టార్గెట్ చేస్తూ చేయని తప్పుకు కూడా క్షమాపణలు చెప్పించుకుంటున్నారంటూ పవన్ పేరు లేకుండా ట్రిగ్గర్ చేసే పోస్టులతో ప్రకాష్ రాజ్ సంచలనం సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ఈ విషయంపై ప్రముఖ నటి మాధవీలత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను విడుదల చేసింది.

‘‘ప్రకాష్ రాజ్ ఇప్పుడు సనాతన ధర్మం మీదనే ఫోకస్ పెట్టారు. తిరుమల లడ్డూ విషయంలో ఎందుకంత వివక్ష? చూపిస్తున్నారు. మొన్న బెంగుళూర్‌లో ఆంజనేయస్వామి కీర్తనలు వింటున్న వాళ్ళను వేరే మతం వాళ్ళు వచ్చి కొడితే.. అలాంటి ఇష్యూపై ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడడు. తిరుపతి లడ్డూ విషయంలో హీరో కార్తీ తన ప్రమేయం లేకున్నా.. హిందువుల మనోభావాలను గౌరవించి క్షమాపణలు చెప్పారు.

మన ధర్మం మీద మనమే కామెంట్స్ చేసుకుంటే ఇంకెవరో కామెంట్స్ చేస్తారనే ఉద్దేశంతో సారీ చెప్పారు. మరీ ప్రకాష్ రాజ్ ఏంటో తెలియదు. కానీ, వేరే విషయంల్లో ఏమనరు. కానీ, మన హిందువుల విషయంలోనే కామెంట్స్ చేస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నా ఆయన సైలెంట్‌గా ఉంటారు. వేరే వాళ్ళ మనోభావాల విషయంలో వైలెంట్‌గా ఉంటారు. అదే మా విషయానికి దగ్గరకు వచ్చే సరికి ప్రతి దాన్ని పాయింట్ అవుట్ చేస్తుంటారు’’ అని చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed