ఆ కంపెనీ తిరిగొచ్చినందుకు హ్యాపీగా ఉంది.. సీఎం చంద్రబాబు హర్షం

by Gantepaka Srikanth |
ఆ కంపెనీ తిరిగొచ్చినందుకు హ్యాపీగా ఉంది.. సీఎం చంద్రబాబు హర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు లులూ గ్రూపు (Lulu Group) సిద్ధమైంది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధికారికంగా ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ.. లులూ గ్రూప్‌ను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. లులూ గ్రూప్ ఏపీకి తిరిగివచ్చినందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్‌ రంగం(Food processing sector)లో పెట్టుబడులకు.. ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలోనూ లులూ కార్యకలాపాల ప్రణాళికలపై చర్చించినట్లు తెలిపారు. కాగా, శనివారం సచివాలయం వేదికగా సీఎం చంద్రబాబుతో లులు గ్రూప్‌ ఛైర్మన్‌ యూసఫ్‌ అలీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో పెట్టుబడులపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. విశాఖలో మాల్‌, మల్టీప్లెక్స్‌, హైపర్‌ మార్కెట్‌ ఏర్పాటు, విజయవాడ, తిరుపతిలో మల్టీప్లెక్స్‌ల నిర్మాణంపై చర్చించారు. లులు బృందంతో సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినట్లు సీఎం వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed