Laddu Issue: కల్తీలో భాగమైన ప్రతీ ఒక్కరినీ శిక్షించాలి.. ఆధ్యాత్మిక గురువు రవిశంకర్

by Ramesh Goud |
Laddu Issue: కల్తీలో భాగమైన ప్రతీ ఒక్కరినీ శిక్షించాలి.. ఆధ్యాత్మిక గురువు రవిశంకర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కల్తీలో భాగమైన ప్రతీ ఒక్కరినీ తప్పకుండా శిక్షించాలని ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ కోరారు. తిరుపతి లడ్డూలో పంది కొవ్వు, ఫిష్ ఆయిల్స్ తో తయారు చేసిన నెయ్యిని వాడుతున్నారని ల్యాబ్ రిపోర్టులో వెల్లడైన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఈ ఘటనపై వెంకటేశ్వర స్వామి భక్తులు, హిందు సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే తిరుపతి లడ్డూ కల్తీపై రవిశంకర్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తులను తీవ్రంగా కలిచివేసిందని, ఇందులో భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారని మండిపడ్డారు. ప్రసాదంలో కల్తీ చేయడం ఏంటని ప్రశ్నించారు. అంతేగాక ఈ కల్తీలో భాగమైన ప్రతీ ఒక్కరిని తప్పక శిక్షించాలని డిమాండ్ చేశారు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో కనిపెట్టి, వారి ఆస్తులను కూడా సీజ్ చేయాలని చెప్పారు. ఇక ఈ వ్యవహరంలో పాలు పంచుకున్న అందరినీ జైళ్లో వేయాలని రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed