కృష్ణా జిల్లాలో ప్రమాదం.. టోల్ ప్లాజా పిల్లర్‌ను బలంగా ఢీకొట్టిన బస్సు

by srinivas |
కృష్ణా జిల్లాలో ప్రమాదం.. టోల్ ప్లాజా పిల్లర్‌ను బలంగా ఢీకొట్టిన బస్సు
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా దావులూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక టోల్‌ప్లాజా పిల్లర్‌ను ఆర్టీసీ బస్సు (Rtc Bus) బలంగా ఢీకొట్టింది. బ‌స్సు మచిలీపట్నం (Machilipatnam) నుంచి విజయవాడ (Vijayawada) వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనతో రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ ఫోన్‌లో మాట్లాడుతూ బ‌స్సు న‌డిపారని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed