కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు..రేపు అక్కడి నుంచే నామినేషన్లు వేస్తున్నా?

by Disha Web Desk 18 |
కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు..రేపు అక్కడి నుంచే నామినేషన్లు వేస్తున్నా?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికల వేళ రాష్ట్రవ్యాప్తంగా పోటీలో ఉన్న నేతలంతా రేపు నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే గాజువాక ఎమ్మెల్యేగా, విశాఖ ఎంపీగా పోటీ చేయనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. అలాగే రేపు విశాఖలో నామినేషన్లు వేయనున్నట్లు వెల్లడించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీలో 30 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే తాను సీఎం అవుతానని చెప్పారు. ఈ క్రమంలోనే కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖను వాషింగ్టన్ డీసీగా, ఏపీని అమెరికా చేసే సత్తా తనకుందని చెప్పుకొచ్చారు. మూడు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు.

నన్ను గెలిపిస్తే మీరు షాక్ అవుతారు అంతా అభివృద్ధి చేస్తానంటూ ఆయన చెప్పారు. చీకటి కావాలంటే ప్రతిపక్షాలను, వెలుగు కావాలంటే తనను గెలిపించాలన్నారు. నన్ను చంపాలని చూస్తున్నారు నాకు నరకం చూపిస్తున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడి కత్తి డ్రామా లాంటిదే గులక రాళ్ల దాడులు అని అధికార, ప్రతిపక్షాలు నాటకాలు ఆడుతున్నాయని ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీని ఎదిరించే సత్తా తనకు తప్ప ఎవరికీ లేదన్నారు. మళ్ళీ మోడీ వస్తే మణిపూర్ లాంటి ఘటనలు జరుగుతాయన్నారు. ఈ మీడియా సమావేశంలో ప్రజాశాంతి పార్టీ పాటను కేఏపాల్ ఆవిష్కరించినట్లు తెలిపారు.

Next Story