జనసేన నేత బొలిశెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
జనసేన నేత బొలిశెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన నేత బొలిశెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్ ఉద్యమంలో కొందరు నేతలు నటిస్తున్నారని అన్నారు. కార్మిక సంఘాల నేతలు దొంగ ఉద్యమాలు చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. అలాంటి నేతలను యువ నాయకులు చాచిపెట్టి కొట్టాలని అన్నారు. ఎందుకు అఖిలపక్షం వేయమనలేదో అడగాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. బొలిశెట్టి వ్యాఖ్యలపై కార్మిక సంఘాల నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి బొలిశెట్టి సత్యనారాయణ అమ్ముడుపోయారని ఆరోపిస్తున్నారు.

బీజేపీకి తొత్తులుగా మారి స్టీల్‌ప్లాంట్‌ను మట్టుబెట్టాలని చూస్తే ఊరుకోమని కార్మిక సంఘం నేతలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తీవ్ర కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా ముడిసరుకు కొరత ఏర్పడటం, చివరికి అది ప్లాంట్ మూసివేతకు దారి తీస్తున్న నేపథ్యంలో కూటమి సర్కార్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తమపై ఒత్తిడి పెంచుతున్న కార్మిక నేతలపై ఇవాళ జనసేన పార్టీ సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో కార్మిక నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed