- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
Video Viral:‘సైకిల్కి ఓటు వేశారు నీకే కదా’..స్కూల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేకు వింత అనుభవం
![Video Viral:‘సైకిల్కి ఓటు వేశారు నీకే కదా’..స్కూల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేకు వింత అనుభవం Video Viral:‘సైకిల్కి ఓటు వేశారు నీకే కదా’..స్కూల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేకు వింత అనుభవం](https://www.dishadaily.com/h-upload/2024/07/02/348294-untitled-1.webp)
దిశ,వెబ్డెస్క్: స్కూల్లో పుస్తకాల పంపిణీ సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ను ఓ పిల్లాడు ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం లోని ఓ స్కూల్కు వెళ్లారు. ఎమ్మెల్యే నుంచి పుస్తకాలు తీసుకోవాడానికి లైన్లో వచ్చిన ఒకటో తరగతి చదువుతున్న ఆ బుడతడు..‘సైకిల్కి ఓట్లు వేశారు నీకే కదా?’ అని ఆయన చెవిలో అడిగాడు. ఆ విషయం ఎమ్మెల్యే తన పక్కన ఉన్న వ్యక్తికి చెప్పడంతో అక్కడున్న వారంతా పగలబడి నవ్వారు. పిల్లాడికి ఎంత తెలివో..అంటూ ప్రశంసించారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది. 'ఒక హైస్కూలో ఫస్ట్ క్లాస్ కుర్రోడు సైకిల్కి ఓట్లు వేశారు నీకే కదా అని భలే బోల్డ్గా డైరెక్ట్గా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుగారినే అడిగాడు' సో క్యూట్ అంటూ వీడియోను ట్వీట్టర్లో షేర్ చేశారు. ఎంత ధైర్యంగా తన మనసులో మాట చెప్పాడు అంటూ వీడియోను చూసి అందరూ నవ్వుకుంటున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు ప్రజలతో ఇలా ఫ్రెండ్లీగా ఉండాలని నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు.