అంగన్వాడీ కార్యకర్తలకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం దుర్మార్గం : ఆచంట సునీత

by Seetharam |
అంగన్వాడీ కార్యకర్తలకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం దుర్మార్గం : ఆచంట సునీత
X

దిశ, డైనమిక్ బ్యూరో : అంగన్వాడీ కార్యకర్తలకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి నియంతృత్వానికి పరాకాష్ట అని తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఆచంట సునీత అన్నారు . చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ కుప్పంలో ఏర్పాటు చేసిన టీడీపీ దీక్షా శిబిరంలో అంగన్వాడీలు పాల్గొనడం తప్పా? ఆచంట సునీత ప్రశ్నించారు. చంద్రబాబు ప్రజా నాయకుడు. ఆయన జీవితమంతా ప్రజల కోసమే పనిచేశారు. అలాంటి వ్యక్తిపై అక్రమ కేసులు బనాయించి జైలు పాల్జేస్తే చూస్తూ ఊరుకోవాలా? నిరసన తెలిపే హక్కు లేదా? అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అని నిలదీశారు. 70 మంది అంగన్వాడీలు, సహాయకులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అంగన్వాడీలపై సీఎం జగన్ రెడ్డి కక్ష కట్టారు అని ధ్వజమెత్తారు. నాలుగేళ్లుగా వారి సమస్యలు పరిష్కరించకుండా ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అణిచివేత ధోరణి విడనాడాలి. తక్షణమే అంగన్వాడీలకు ఇచ్చిన షోకాజ్ నోటీసు ఉపసంహరించుకోవాలి అని తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఆచంట సునీత డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed