Amaravati: అమరావతిలో ఆగని చోరీలు.. మంచినీటి పైపులు ఎత్తుకెెళ్లిన దుండగులు

by srinivas |   ( Updated:2024-07-06 08:59:38.0  )
Amaravati: అమరావతిలో ఆగని చోరీలు.. మంచినీటి పైపులు ఎత్తుకెెళ్లిన దుండగులు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వం మారినా ఏపీ రాజధాని అమరావతిలో చోరీలు మాత్రం ఆగటంలేదు. రాజధాని నిర్మాణంలో భాగంగా ఎన్సీసీ కంపెనీకి చెందిన మంచినీటి బీడు పైపులను కొనుగోలు చేశారు. తుళ్లూరు, దొండపాడులో వీటిని సీడ్ యాక్సిన్ రోడ్డు సమీపంలో నిల్వ ఉంచారు. అయితే ఈ పైపులు ఒక్కొక్కటిగా చోరీకి గురవుతున్నాయి. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ పైపులను ముక్కలుగా కోసుకుని ఎత్తుకెళ్లిపోతున్నారు. దీంతో అమరావతి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దొంగలను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం హయాంలోనూ రాజధాని సామాగ్రిని కొందరు వ్యక్తులు విచ్చలవిడిగా ఎత్తుకెళ్లిపోయారని, ఈ ప్రభుత్వంలోనై రాజధాని సామాగ్రి చోరీకి గురి కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.


Advertisement

Next Story

Most Viewed