AP News:బ్రిడ్జి కొట్టుకుపోతే మంత్రి ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు:ఎమ్మెల్యే

by Jakkula Mamatha |
AP News:బ్రిడ్జి కొట్టుకుపోతే మంత్రి ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు:ఎమ్మెల్యే
X

దిశ, కళ్యాణదుర్గం: గత వైసీపీ ప్రభుత్వంలో పేరూరు డ్యామ్ గేట్లు ఎత్తిన సమయంలో పెన్నా నదిపై నూతిమడుగు సమీపంలో ఉన్న బ్రిడ్జి కొట్టుకుపోతే అప్పటి ఎమ్మెల్యే మంత్రిగా ఉండి కనీసం కూలిన బ్రిడ్జి చూడటానికి కూడా రాలేదంటే ఎంత దౌర్భాగ్యమో అని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఏద్దేవా చేశారు. గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు నూతిమడుగు సమీపంలోని పెన్నా నదిపై ఉన్న బ్రిడ్జి మధ్యలో కూలిపోయిందని గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు వెంటనే కూలిన బ్రిడ్జి ప్రాంతాన్ని ఆర్ అండ్ బీ అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ గ్రామాల ప్రజలకు, విద్యార్థులకు, ఉద్యోగస్థులకు ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా తాత్కాలికంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే అమిలినేని ఆదేశాలు జారీ చేశారు. వెంటనే శాశ్వత పరిష్కారం కోసం బ్రిడ్జి నిర్మాణానికి ఎంత నిధులు అవసరమో ఎస్టిమేషన్ వేసి సంబంధిత శాఖ అధికారులకు అందించాలని వచ్చే మూడు, నాలుగు నెలల్లో బ్రిడ్జి నిర్మించి ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని ఎమ్మెల్యే అమిలినేని భరోసా ఇచ్చారు.

Advertisement

Next Story