- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పవన్ గెలిస్తే ప్రపంచ స్థాయికి పిఠాపురం..ప్రచారంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్!
దిశ,పిఠాపురం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అసెంబ్లీకి అడుగుపెడితే పిఠాపురం ప్రపంచ స్థాయికి చేరుతుందని యువ హీరో, మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ అన్నారు. పవన్కు మద్దతుగా వైష్ణవ్ తేజ్ బుధవారం ఉప్పాడ కొత్తపల్లి మండలంలో పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా హీరో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ తన చిన్నప్పటి నుంచి పవన్ను అతి దగ్గరగా చూస్తున్నానని ఆయన ఏదైనా అనుకుంటే కచ్చితంగా సాధిస్తారని అన్నారు. సొంతంగా సంపాదించిన డబ్బులు రైతులకు పంచిపెట్టిన మంచి వ్యక్తి పవన్ అన్నారు. ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తూ వస్తున్నారని ఈసారి కచ్చితంగా ఆయన గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. పిఠాపురం ఎంతో అభివృద్ధి చెందుతున్న విషయాన్ని వైష్ణవ్ తేజ్ ప్రస్తావించారు. ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే బాధ్యతను పవన్ తీసుకుంటారన్నారు. వైష్ణవ్ పర్యటనలో అడుగడుగునా జనం నీరాజనం పలికారు. పూల వర్షం కురిపించారు. పెద్ద ఎత్తున మెగా అభిమానులు, టీడీపీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అసెంబ్లీకి అడుగుపెడితే పిఠాపురం ప్రపంచ స్థాయికి చేరుతుందని యువ హీరో, మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ అన్నారు.జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అసెంబ్లీకి అడుగుపెడితే పిఠాపురం ప్రపంచ స్థాయికి చేరుతుందని యువ హీరో, మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ అన్నారు. జనసేన , బీజేపీ నాయకులు, బుల్లితెర నటులు సుడిగాలి సుధీర్, గెటప్ శీను పర్యటనలో పాల్గొన్నారు.
Read More..
BREAKING: ఏపీలో మా మద్దతు ఆ పార్టీకే.. తేల్చేసిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ