వ్యూహం సినిమాపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ

by Shiva |
వ్యూహం సినిమాపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ
X

దిశ, వెబ్‌డెస్క్ : సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. సినిమాలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌ను అవమానించేలా సన్నివేశాలు ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు సినిమా విడుదలను హైకోర్టు నిలిపివేసింది. దీంతో నేడు సినిమా సంబంధించి అన్ని విషయాలను న్యాయ‌స్థానం కూలంకశంగా పరిశీలించనుంది.. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ సవాలు చేస్తూ డివిజన్ బెంచ్‌లో నిర్మాత అప్పిల్ చేశారు. సినిమా విడుదల నిలిచిపోవడంతో రూ.కోట్లలో నష్టం వాటిల్లితోందని నిర్మాత తరఫు న్యాయవాది వాదించారు. ఇరు పక్షాల వాదలను విన్న కోర్టలు ఈ నెల 11 వరకు వ్యూహం సినిమా విడుదల నిలిపివేస్తూ కొద్ది రోజుల క్రితం సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 11‌కు బదులు 8న విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వాలని వ్యూహం నిర్మాత కోరారు. మెరిట్స్ ఆధారంగా ఈ నెల 8న సినిమాపై నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జ్‌కు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.



Next Story