- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
‘వాడిని నడిరోడ్డుపై ఉరి తీయాలి’.. ఆ బాలిక తల్లి కన్నీటి వేదన
దిశ,వెబ్డెస్క్: కడప జిల్లా బద్వేలులో పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. నిన్న(శనివారం) విఘ్నేష్ పెట్రోల్ పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడి, కడప జిల్లా రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన పై బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే తాజాగా చనిపోయిన బాలిక తల్లి కన్నీటి వేదన అందరినీ కలచివేస్తోంది. బిడ్డను కోల్పోయిన ఆ తల్లి రోదన అందరినీ తీవ్రంగా కలచివేసింది. రీసెంట్గా బాలిక తల్లి కడప రిమ్స్ వద్ద మీడియాతో మాట్లాడారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ ప్రశ్నల వర్షం కురిపించారు. మీరు ఏం న్యాయం చేస్తారు? వాడిని నడిరోడ్డు పై ఉరి తీస్తారా? లేదా నా కూతురి పై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లే వాడిని తగలబెడతారా? నా కూతురిని నాశనం చేసి అన్యాయంగా చంపేశాడు. వాడిని వదలకూడదు అంటూ ఆ బాలిక తల్లి వెక్కి వెక్కి ఏడ్చారు.