- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
Gorantla Buchaiah: పార్టీలోకి వచ్చే వాళ్లు పదవులు ఆశించొద్దు: గోరంట్ల బుచ్చయ్య షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్డెస్క్: ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కూటమి ప్రభత్వం అఖండ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పరిపాలనలో దూసుకెళ్తోంది. మరోవైపు ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ఘోర పరాజయం పాలవ్వడంతో ఆ పార్టీలో ఏదో తెలియని అనిశ్చితి నెలకొంది. దీంతో రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు సైతం తెలుగుదేశం పార్టీలోకి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ లీడర్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు పార్టీలోకి వచ్చే నాయకులంతా పదవులు ఆశించొద్దని బాంబు పేల్చారు. ప్రస్తుతం ఉన్నవాళ్లలోనే చాలా మందికి పదువుబు సర్దుబాటు చేయాల్సి ఉందని అన్నారు. పార్టీలో చేరగానే కిరీటాలు పెడతారని ఎవరూ ఆశించొద్దంటూ షాకిచ్చారు. ఎవరైనా వైసీపీ నుంచి టీడీపీలోకి రావాలనుకుంటే వాళ్లంతట వాళ్లుగా రాజీనామా చేసి వస్తే ఆలోచిస్తామని అన్నారు. అదేవిధంగా వైసీపీకి వత్తాసు పలుకుతున్న ఐఏఎస్, ఐపీఎస్లపై కూడా విచారణ ఉంటుందని గోరంట్ల హెచ్చరించారు.