DSC అభ్యర్థులకు గుడ్ న్యూస్..చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం

by Jakkula Mamatha |
DSC అభ్యర్థులకు గుడ్ న్యూస్..చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీ ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులకు(DSC) గుడ్ న్యూస్ చెప్పింది. అర్హత(Qualification) కలిగి ఉన్నత చదువులు, ప్రభుత్వ ఉద్యోగాలు(Govt Jobs) సాధించాలని పట్టుదలతో ఉన్న వారికి ఉచిత ట్రైనింగ్ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని గిరిజన అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ(DSC) శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏజేన్సీ ప్రాంతాల్లోని 6 ఐటీడీఏ(ITDA)ల్లో, గిరిజనేతరుల ప్రాంతాల్లో రెండు లేదా మూడు సెంటర్లు ఏర్పాటు చేయనుంది. ఒక్కో కేంద్రంలో 150 మందికి శిక్షణ ఇస్తారు. మూడు నెలల పాటు సాగే ఈ శిక్షణకు(Training) ఒక్కో అభ్యర్థికి రూ.25 వేల వరకు ఖర్చు చేయనుంది. కాగా 16,347 పోస్టులను ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్న నేపథ్యంలో ఈ ఉచిత శిక్షణకు సంబంధించిన తేదీలను అధికారికంగా ప్రకటించలేదు.

Advertisement

Next Story