మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడా : పీసీసీ చీఫ్ షర్మిల

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-18 08:53:10.0  )
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడా : పీసీసీ చీఫ్ షర్మిల
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో టీడీపీ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు ఎక్కడ అని పీసీసీ చీఫ్ వైఎస్.షర్మిల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. షర్మిల విజయవాడ బస్టాండ్ నుంచి తెనాలికి బస్సులో ప్రయాణించారు. బస్సులో టిక్కెట్ కొని ఉచిత ప్రయాణం ఎక్కడ అని ప్రశ్నించారు. తనతో పాటు బస్సులోని మహిళా ప్రయాణికులంతా కొన్న టికెట్లను మీడియా ముందు చూపించారు. మీకు ఉచిత బస్సు ప్రయాణం కావాలా వద్దా అని మహిళా ప్రయాణికులను ప్రశ్నించగా, వారంతా కావాలని కోరారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల్లో కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుందన్నారు. బస్సు ప్రయాణంలో భాగంగా షర్మిల మహిళా ప్రయాణికులతో ముచ్చటిస్తూ ఉచిత సిలిండర్లు, రేషన్ బియ్యం అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed