Corruption: నలుగురు కమర్షియల్ టాక్స్ అధికారులు సస్పెండ్

by srinivas |   ( Updated:2025-02-26 10:45:32.0  )
Corruption: నలుగురు కమర్షియల్ టాక్స్ అధికారులు సస్పెండ్
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా హిందూపురం(Hindupur)లో నలుగురు కమర్షియల్ టాక్స్ అధికారుల(Commercial Tax Officers)పై సస్పెన్షన్ వేటు పడింది. వ్యాపారుల(Traders) వద్ద సీటీవో కృష్ణవేణి, డీసీటీవోలు రాజశేఖర్ రెడ్డి, మధుసూదన్, ఇంతియాజ్ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు చెలరేగాయి. జీఎస్టీ(Gst) వసూళ్ల విసయంలో వ్యాపారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు పలువురు నుంచి ఫిర్యాదు అందాయి. దీంతో వారిపై ఉన్నతాధికారులు నిఘా పెట్టారు. స్పెషల్ టీమ్‌ను ఏర్పడి చేసి విచారణ చేయించారు. స్పెషల్ టీమ్ అందజేసిన నివేదిక ఆధారంగా నలుగురు ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్లు తేలింది. దీంతో నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Next Story

Most Viewed