- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
AP News:జనసేనలో చేరనున్న మాజీ మంత్రి సోదరుడు
by Jakkula Mamatha |
X
దిశ,వెబ్డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి దక్కలేదు. దీంతో పలువురు పార్టీ నేతల్లో అసహనం నెలకొంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగలనుంది. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స లక్ష్మణరావు జనసేనలో చేరనున్నారు. వచ్చే నెల 3న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవితో మంగళవారం రాత్రి ఆయన భేటీ అయ్యారు. ఆయనతో పాటు నెల్లిమర్ల నియోజకవర్గంలో పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
Next Story