తిరుమల లడ్డును చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు: పేర్ని నాని

by Mahesh |
తిరుమల లడ్డును చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు: పేర్ని నాని
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల లడ్డూ(Tirumala Laddu) కల్తీ అయింది. ఈ వ్యవహారం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు, జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో గత ప్రభుత్వం వల్లే ఇలా జరిగిందని వైసీపీ(YCP)పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కాగా ఈ వ్యవహారంపై బుధవారం మాజీ మంత్రి పేర్ని నాని(The former minister's name is Nani) స్పందించారు. తాడేపల్లిలోని వైసీపీ(YCP) ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ తయారీలో జంతువు కొవ్వు తెలిసిందంటూ టీడీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేశారు. నెయ్యిని వెనక్కి పంపామని ఈవో శ్యామలరావు చెప్పారని చంద్రబాబు, లోకేష్ పచ్చి అబద్ధాలు ఆడారని మండిపడ్డారు. కూటమి నేతల పాపాల పరిహారం కోసం ఆలయాల్లో పూజలకు వైసీపీ పిలుపునిస్తోందని పేర్ని నాని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Next Story