AP:పిఠాపురంలో మైనర్ బాలికపై లైంగికదాడి.. డిప్యూటీ సీఎం పవన్ పై మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |   ( Updated:2024-10-08 15:12:35.0  )
AP:పిఠాపురంలో మైనర్ బాలికపై లైంగికదాడి.. డిప్యూటీ సీఎం పవన్ పై మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో ఓ మైనర్ బాలికకు మద్యం తాగించి అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన పై డిప్యూటీ సీఎం పవన్ సొంత నియోజకవర్గంలో మహిళలకు భద్రత లేదా? అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. ఇదే విషయమై వైసీపీ మాజీ మంత్రి రోజా కూడా పవన్ కళ్యాణ్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. డిప్యూటీ సీఎం ఇలాకాలోనే మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగితే చర్యలు ఏవి? అని ప్రశ్నించారు. ఈ మేరకు మాజీ మంత్రి రోజా పవన్ కళ్యాణ్ పై సంచలన ట్వీట్ చేసింది.

‘‘డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు.. మీరు పంచె ఎగ్గాట్టాల్సింది గుడి మెట్ల పై కాదు విజయవాడ వరద బాధితుల కోసం అంటూ రోజా ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. మీరు ధర్మం ధర్మం అని అరవాల్సింది.. నడి రోడ్డు పై కాదు వైజాగ్ స్టీల్ కార్మికుల కోసం! అని పేర్కొన్నారు. మీరు గొడవ పడాల్సింది.. మతాల కోసం కాదు నీట మునిగి సాయమందని పేదల కోసం! మీరు కడగాల్సింది మెట్లను కాదు ఇసుక లేకుండా చేస్తున్న మీ నాయకుల అవినీతిని! మీరు దీక్ష చేయాల్సింది ప్రసాదాల కోసం కాదు రాష్ట్రం లో రాలి పోతున్న.. ఎంతో మంది చిన్న పిల్లల మాన ప్రాణాల కోసం! మీరు ఉపవాసం ఉండాల్సింది.. దేవుళ్ల కోసమే కాదు.. ఎక్కడ చూసినా.. ఆహారం కలుషితమై, ఆసుపత్రి పాలౌతున్న విద్యార్థుల కోసం! మీరు బొట్లు పెట్టాల్సింది.. గుడి మెట్లకు కాదు, నాడు నేడుని.. కొనసాగించి.. బాగుపరిచిన బడి మెట్లకు! మీరు డిక్లరేషన్ ప్రకటించాల్సింది.. ఇప్పుడు ఏ లోటు లేని సనాతనం కోసం కాదు.. మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన జనాల కోసం! మీరు ఆపసోపాలు పడాల్సింది.. కొండెక్కడం కోసం కాదు.. రాష్ట్రంలో క్షీణిస్తున్న.. శాంతి భద్రతలు అరికట్టడం కోసం! మీరు సంప్రోక్షణ చేయాల్సింది.. కల్తీ జరిగిందో లేదో తెలియని .. లడ్డూ కోసం కాదు ప్రజలకు ఇసుకే దొరకకుండా చేసిన.. కూటమి నాయకుల అవినీతి ప్రక్షాళన కోసం! మీరు దృష్టి పెట్టాల్సింది పక్క రాష్ట్రాల నాయకుల మాటపై కాదు.. మీ నియోజకవర్గంలో వికృత చేష్టలకు పాల్పడుతున్న మీ నాయకుల పైన..! దేవుడు తమరికి పుట్టుకతో బుద్ధి జ్ఞానం ఇచ్చి ఉంటే దాన్ని కాస్త ఉపయోగించండి’’ అంటూ మాజీ మంత్రి రోజా ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed