- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
చంద్రబాబు హయాంలో అన్ని రంగాలు ఫెయిల్: మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు సూపర్ 6 పథకాలు అమలు చేయలేకపోయారని మాజీ సీఎం జగన్ విమర్శించారు. తమ హయాంలో అన్ని పథకాలను అనుకున్న సమయంలోనే అమలు చేశామని ఆయన గుర్తు చేశారు. ‘‘ఫీజు రీయింబర్స్మెంట్ కూడా సమయానికే అందించాం. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. పిల్లల ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో తల్లిదండ్రులున్నారు. స్కూళ్లను నిర్వీర్యం చేసేశారు. సీబీఎస్ సిలబస్ను ఎత్తేసే యోచనలో ఉన్నారు. వైద్య రంగం కూడా దీనస్థితిలోకి వెళుతోంది. ఆరోగ్య శ్రీ బిల్లులు సైతం పెండింగ్లోనే ఉన్నాయి. చంద్రబాబు సీఎం అయిన తర్వాత 108, 104 సిబ్బందికి జీతం లేదు. ప్రభుత్వ రంగ మెడికల్ కాలేజీలో స్కాములకు పాల్పడుతున్నారు. అభివృద్ధి తిరుగమనం పట్టింది. వ్యవసాయం పూర్తిగా కుంటుపడింది. రైతులకు పెట్టుబడి సాయం కూడా అందించలేదు. ఉచిత పంట బీమా ఎగిరిపోయింది. ఈ క్రాప్ ఇవ్వలేదు. రైతుల పరిస్థితి దీనంగా ఉంది. ప్రతి రంగంలోనూ తిరుగమనం నడుస్తోంది.’’ అని జగన్ వ్యాఖ్యానించారు.
‘‘మా హయాంలో అన్ని పారదర్శకంగా జరిగాయి. ప్రస్తుతం అంతా అన్యాయమే. జన్మభూమి కమిటీలు చెప్పిన వాళ్లకే పథకాలు ఇస్తు్న్నారు. న్యాయాన్ని పాతరేశారు. దొంగ కేసులు పెడుతున్నారు. ఇష్టమొచ్చినట్లుగా రాజ్యపాలన చేస్తున్నారు. అన్ని రకాలుగా ప్రభుత్వం ఫెయిల్ అయింది. ప్రతి అడుగులో డైవర్షన్ పాలిటిక్స్ కనిపిస్తోంది. రాష్ట్రంలో రాచక పాలన నడుస్తోందని మేము ఢిల్లీలో చేస్తే, అదే రోజు మదనపల్లిలో ఫైల్స్ తగలబడిపోయాయి. గోరుముద్ధ కార్యక్రమంలోనూ పిల్లలు అన్యాయమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.’’ అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.