Rahul Gandhi : వరద సహాయక చర్యల్లో పాల్గొనండి.. ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ గాంధీ పిలుపు

by Hajipasha |
Rahul Gandhi : వరద సహాయక చర్యల్లో పాల్గొనండి.. ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ గాంధీ పిలుపు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరదల బీభత్సంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగే సహాయక చర్యల్లో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ప్రభావిత కుటుంబాలకు వీలైనంత సాయం అందేలా పార్టీ తరఫున కృషి చేయాలని వారికి సూచించారు. ఎడతెరిపి లేని వర్షాలు, వరదలకు సంబంధించిన ఘటనల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రాహుల్ గాంధీ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్విరామంగా శ్రమిస్తోందని ఆయన తెలిపారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలను సాధ్యమైనంత త్వరగా ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలను రాహుల్ కోరారు.

Advertisement

Next Story

Most Viewed